TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం హుండీ ద్వారా భక్తులు రూ.4 కోట్లు కానుకలు సమర్పించారు. స్వామి వారిని 64,048 మంది దర్శనం చేసుకోగా.. 19,838 మంది తలనీలాలు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.