సత్యసాయి: రామగిరి మండలంలోని ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. ఒక దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. వీఐపీ మార్గంలోని తాళాలు పగలగొట్టి హుండీని చోరీ చేశారు. అందులో రూ. 2 లక్షలు ఉన్నట్లు సమాచారం. హుండీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.