NLG: మిర్యాలగూడ పట్టణంలోని రైతు బజార్ను పరిశుభ్రంగా ఉంచి రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంచాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున స్థానిక రైతు బజార్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.