ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించామని ఎంపీడీవో రమేష్ తెలిపారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారన్నారు. జిల్లాలో అనేక మంది గర్భిణులు, రోగులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.