ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి స్వామి ఇవాళ వినతి పత్రాలు స్వీకరించారు. పలువురు తమ సమస్యలను వివరించారు. మంత్రి, సంబంధిత అధికారులతో ఆ సమస్యలపై మాట్లాడి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తానని మంత్రి అన్నారు.