AKP: కోటవురట్ల మండలం తంగేడులో కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మతల్లి పండగను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పలువురు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.