SKLM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు సాహిత్యంలోని తొలి ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన మొల్లమాంబ జయంతిని శుక్రవారం అధికారులు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ అధికారి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని ఆమె అన్నారు.