పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. 4 కంపెనీల్లో వివిధ రకాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని, మొత్తం 250 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు GJ కళాశాలలో నిర్వహిస్తామన్నారు.