W.G: నరసాపురంలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో ఈ నెల 6 (శుక్రవారం) భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఈఈ కె.మధుకుమార్ తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణదాతలుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు.