ASR: డుంబ్రిగూడ మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకులోయ నుంచి పాడేరు వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు అవతలికి దూసుకెళ్లి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.