ప్రకాశం: ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలలో ఎల్. ఎల్. బి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 10 వ తేదీ వరకు జరుగుతాయని యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా కోర్సుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు.