VSP: ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మత వైషమ్యాలకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం విశాఖలో పలు ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలను మత రాజకీయాలకు వేదికగా మార్చొద్దని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.