VSP: పారిశుధ్య పనుల్లో లోపాలను సవరించి, దోమల నియంత్రణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్ ఆదేశించారు. నార్త్, వెస్ట్ జోన్లలో పర్యటించిన ఆయన, వ్యర్థాల సేకరణ, కాలువల పరిశుభ్రత పనులు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పారిశుధ్య పనులతో కలిపి నిర్వహించాలని తెలిపారు.