NDL: ఆత్మకూరు మండలం కరివేనా గ్రామంలో ఈనెల 5న ఈస్టర్ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ప్రథమ విజేతకు రూ.60000, ద్వితీయ విజేతకు రూ.50000, తృతీయ విజేతకు రూ.40000, నాలుగో బహుమతిగా రూ.30000 అందించనున్నారు. రైతులు తమ ఎద్దులతో ఈ పోటీలలో పాల్గొనవచ్చని వారు కోరారు.