E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్రేయపురం మండలం రాజవరంకి చెందిన కేదరశెట్టి వీర వెంకట సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వెళ్తుండగా బ్యారేజీ 14వ గేటు వద్ద ప్రమాదవశాత్తు వంతెనను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.