ELR: ఉంగుటూరు మండలంలో మంగళవారం మూడు గ్రామాల్లో ఎంపీడీవో మనోజ్ ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం గ్రామాలలో ఆయన లబ్ధిదారులు ఇంటికెళ్లి ఇంటి పన్ను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ ఆంజనేయ బాబు పంచాయతీ గుమస్తా రంగు స్వరూప పాల్గొన్నారు.