KRNL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ట్రైనింగ్ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గణేకల్లు విరూపాక్షి ఇవాళ పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా నేతలు శిక్షణ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలు, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.