VZM: జిల్లాలో గత వారం రోజుల్లో అసాంఘిక కార్యకలపాలపై నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి, 56 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుండి రూ.86,134 నగదు, 5 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం కలిగిన వారిపై 14 కేసులు నమోదు చేసి, 14మందిని అరెస్టు చేశామన్నారు.