E.G: మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను 138 కేంద్రాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు వెల్లడించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 24,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. అందులో అబ్బాయిలు 12,555 మంది, అమ్మాయిలు 11,983 మంది ఉన్నారన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.