NTR: విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన జరగగా.. ముఖ్య అతిథి జిల్లా కార్యదర్శి శంకర్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు పల్లెల్లో 3, పట్నంలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. జాప్యం లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలన్నారు.