NTR: విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో వినాయక చవితి వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా హాజరయ్యారు.