CTR: కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మిషన్ శక్తి పథకం కింద సఖి వన్ స్టాప్ సెంటర్ను ఆదివారం ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, కడ పిడి వికాస్ ప్రారంభించారు . ఈ కేంద్రంలో మహిళలకు అత్యవసర సహాయం, చట్టపరమైన సలహాలు, వైద్య, కౌన్సిలింగ్ సేవలు ఒకే చోట అందించబడతాయన్నారు. మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా 181 హెల్ప్లైన్ను సంప్రదించాలన్నారు.