MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లాలో మహిళామణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అపూర్వమని ఆయన కొనియాడారు. విద్య, రాజకీయాలు, శాస్త్రసాంకేతిక, క్రీడా రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో దేశ ప్రగతిలో కీలక భాగస్వాములవుతున్నారన్నారు.