KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం జిల్లాలోని ముస్లిం సోదర, సోదరీమణులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ శాంతి, ఐక్యత, దానధర్మాలు, మానవత్వానికి ప్రతీక అని, నెల రోజుల ఉపవాస దీక్ష తర్వాత వచ్చే ఈ పండుగ సోదరభావాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.