అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో యూరియా నిల్వలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.