మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రేపు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు తన్మై, దొరబాబు, శాంతి కుమార్, రైసింగ్ రాజ వస్తున్నారని నిర్వాహకులు తెలపారు.