ELR: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాలలోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేవారిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు.