ATP: పామిడి పంచాయతీ పరిధిలో ఏడాదిపాటు సుంకం వసూళ్ల పనులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈఓఆర్డీ అశ్వర్ధనాయుడు తెలిపారు. దినసరి మార్కెట్, బస్టాండ్, జంతు వధశాల, తాటిఫలసాయం సుంకపు వసూళ్లకు వేలం ఉంటుందన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేయాలన్నారు.