సత్యసాయి: ధర్మవరంలో ‘ఆర్డీటీని రక్షించుకుందాం’ అనే నినాదంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా అనంత ప్రజల జీవనాడిగా మారి పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ప్రతికూల చర్యలు ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సంస్థ ప్రతి గడపకూ చేరువైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.