SKLM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కార్మికులను 50 ఏళ్ల వయోపరిమితి పేరుతో తొలగించడం అన్యాయమని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అన్నారు. రాయలసీమ జిల్లాల్లో కార్మికుల తొలగింపులకు నిరసనగా ఇవాళ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించడం చట్టవ్యతిరేకమని తేజేశ్వరరావు అన్నారు.