కడప: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మైదుకూరులో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొనగా సుమారు 205 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 125 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి.