VZM: జిల్లాలోని వివిధ మండలాల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమ నిల్వలు చేసి పట్టుబడిన 15 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జే.సీ. సేధు మాధవన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే రేషన్ కార్డులురద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.