NRML: జిల్లాలోని ఎస్వీఆర్ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్ డాక్టర్ సంతోష్ రాజ్పై దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడులు చేయడం తీవ్రమైన నేరమని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై దౌర్జన్యం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.