NDL: ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ షహబుదీన్ పాల్గొన్నారు. బుద్ధా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఇవాళ పట్టణంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.