W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.