PKSM: మార్కాపురం పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువర్ధక శాఖ సహకారంతో ఇవాళ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. గేదెలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తెలుగుదేశం నాయకులు, శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.