TPT: గుంటూరుకు చెందిన శ్రీ వేంకటేశ్వర పౌల్ట్రీస్ సంస్థ అధినేత వేంకటేశ్వరరావు, టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళం అందజేశారు. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం సేవల కోసం ఈ విరాళం వినియోగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.