కడప నగరంలోని 50వ డివిజన్ ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ నిర్వహించారు. చిరకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.