KRNL: పెద్దకడబూరులో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ సేవలు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయం-1లో సిబ్బంది కొరత వేధిస్తోందని స్థానికులు చెప్పుకొచ్చారు. అన్ని మండల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ సకాలంలో ప్రజలకు సేవలు అందడంలేదని తెలిపారు. ఆధార్, భూముల మ్యూటేషన్ సేవల కోసం పక్కగ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు.