TPT: రేణిగుంట మండలం గుత్తివారి పల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ, రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని సీతారాములును దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.