KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసంలో అమరావతి చట్టబద్ధతకు మద్దతుగా ఇంటి ముందు ముగ్గు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి లభించిన చట్టబద్ధత రాష్ట్ర ప్రజలందరి విజయమని, దేశం మొత్తం దీనికి బాసటగా నిలవడం చారిత్రాత్మకమని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు అమరావతి అభివృద్ధి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.