ATP: పుట్లూరు మండలం పి. చింతలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. రామశేఖర్ రెడ్డి అనే రైతు మొక్కజొన్న సాగు కోసం వినియోగించిన పైపులను వేప చెట్టు వద్ద భద్రపరుచుకున్నారు. దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రైతు ఆవేదన వ్యక్తం చేశారు.