VZM: బొబ్బిలి,రామభద్రపురం మార్గంలో వేగావతి నదిపై నిర్మిస్తున్న పారాధి వంతెన నిర్మాణ పనులను ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం స్వయంగా పర్యవేక్షించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీపడకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి సూచించారు.