NDL: అవుకు మండలం సంగపట్నం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. కావున మండలంలోని అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.