SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తడకమల్ల లాలమ్మ ఇటీవల మరణించడంతో బుధవారం ఆమె చిత్రపటానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రాంబాబు, సుదర్శన్, రాములు, రమేష్ పాల్గొన్నారు.