సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రజిని (19) కనిపించడం లేదని తల్లి నాగమ్మ, తండ్రి ఆదినారాయణలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9676852213 నంబర్కు తెలపాలని కోరారు.