NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన కబడ్డీ పోటీలను బీసీ ఇందిరమ్మ ఘనంగా ప్రారంభించారు. అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఆమె బహుమతులను అందజేశారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.