సత్యసాయి: సోమందేపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు.