ఎన్టీఆర్: తిరువూరు(M) ఆంజనేయ పురంలో 2025-26 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కుటుంబరావు బుధవారం ప్రారంభించారు. ఎండల తీవ్రత ఉన్నందున వడదెబ్బ తగలకుండా, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పని దినాలు పూర్తి చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఎఫ్ఏ రామారావు, టీఏ నాగమణి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.