ప్రకాశం: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. వెంకట కోటిరెడ్డి ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడి వెంకట కోటిరెడ్డి అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.